మహబూబాబాద్ : కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారి పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పట్టణ పేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పరమత సహనం సీఎం కేసీఆర్ నైజం అన్నారు. అందుకే రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద ముస్లింలు, క్రైస్తవులకు కొత్త బట్టలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈద్గాలు, మసీదుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వసతులు కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వం ముస్లింలను గౌరవిస్తు రంజాన్ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. కొవిడ్ నిబంధనల నడుమ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్