పోచమ్మమైదాన్, జూలై 20: వరంగల్కు చెందిన ప్రముఖ కవి, రచయిత, ఆచార్య రామా చంద్రమౌళి ఏకకాలంలో రెండు సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. నిజామాబాద్కు చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ అందించే ‘అమృతలత’ అవార్డుకు ఎంపికయ్యారు. కోల్కతాకు చెందిన రవీంద్రనాథ్ఠాగూర్ కవితాఘర్-2021 అంతర్జాతీయ తెలుగు కవితల పోటీలో రామా చంద్రమౌళి రెండోస్థానం దక్కించుకున్నారు. ప్రొఫెసర్ రామా చంద్రమౌళితోపాటు డాక్టర్ ముక్తేవి భారతి, విహారి ‘అమృతలత’ అవార్డులకు ఎంపికైనట్టు ఆ సంస్థ కార్యదర్శి నెల్లుట్ల రమాదేవి తెలిపారు. దరూరి సులోచనాదేవి, ప్రొఫెసర్ అరుణభిక్షు, అయ్యగారి వసంతలక్ష్మి, శశిరెడ్డి, డాక్టర్ శ్రీనగి, రేణుక అయోల, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, విమలక్క, కుప్పిలి పద్మ, డాక్టర్ వీ త్రివేణి అపురూప అవార్డులకు ఎంపికైనట్టు పేర్కొన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు.