భువనగిరి: కరోనా విధుల్లో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సీతారామరాజు నైట్ కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు. దీంతో అప్పటివరకు తమతోపాటే పనిచేస్తున్న ఏఎస్సై మరణించడంపై తోటివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతారామరాజు మృతి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు.