న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు కొత్త జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెన్స్ (ఐఎల్బీఎస్)లో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం 3-4 రోజుల్లోనే నమూనాల ఫలితాలు వస్తాయని, కరోనా కొత్త వేరియంట్ను త్వరగా గుర్తించవచ్చని చెప్పారు. ఉత్తర భారత్లో ఇలాంటి ల్యాబ్ కేవలం ఢిల్లీలోనే ఉన్నదని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.