హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరో ఉన్నతాధికారిని బలి తీసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు నగరంలోని ఓమ్ని ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస సమస్యతో బాధపడుతున్న అంజయ్య.. చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. అంజయ్య మృతిపట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సిబ్బంది సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.