నిర్మల్ అర్బన్, మార్చి 25 : నిర్మల్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిలావర్పూర్లో అరుదైన రాయగజకేసరి శిల్పం వెలుగుచూసింది. ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవ్రావు పరిశోధనలో భాగంగా గురువారం గ్రామంలో రుద్రమదేవి కాలానికి చెందిన రాయజగకేసరి విగ్రహాన్ని గుర్తించారు. కాకతీయుల రాజధాని వరంగల్ కోటలోని స్వయంభు ఆలయంలో రాయగజకేసరి పేరిట కొన్ని శిల్పాలు ఉన్నాయని, దేవగిరి యాదవ రాజులను జయించిన తర్వాత రుద్రమదేవి ఈ శిల్పాలను తయారు చేయించిందని తెలిపారు. దిలావర్పూర్లో కూడా రుద్రమ దేవి వేయించిన శిల్పం 1279-80 సంవత్సరానికి చెందినదని వివరించారు.