వనపర్తి : దేశంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై మంత్రుల నివాస సముదాయం నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేశాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మేలు చేయాలని తీసుకున్న నిర్ణయం అని మంత్రి చెప్పారు.
దేశ వ్యాప్తంగా వస్తున్న దిగుబడిలో సగానికి పైగా ధాన్యం తెలంగాణ నుంచి వస్తుందని, మిల్లర్లు అధికారులు చెప్పింది వినాలని మిల్లర్లు చెప్పింది అధికారులు వినొద్దన్నారు. రైతు కల్లంకాడికి వస్తే ఇంత ధాన్యం ప్రేమతో పెడతాడు. కానీ తూకం వేసిన తర్వాత అన్యాయంగా కట్ చేస్తే ఏ మాత్రం ఒప్పుకోమని తూకం వేసిన తరువాత మళ్లీ తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎవరైనా మిల్లర్లు తరుగు తీస్తే మిల్లుల లైసెన్సులు నిర్మోహమాటంగా రద్దు చేయండి. అందుబాటులో ఉన్న అన్ని రైతువేదికలు, ఇతర గోదాంలు అన్నీ వినియోగించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలన్నారు.
కరోనా విపత్తులోనూ ప్రభుత్వం కొంటున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంట అమ్ముకునే విషయంలో ఇబ్బందిపెట్టటం మంచి పద్ధతి కాదన్నారు.
మిల్లర్ల విషయంలో ఎట్టి పరిస్థితులలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించొద్దన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, పౌరసరఫరాలు శాఖ డీఏవో, డీసీవో, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ అధ్యక్షులు, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి