సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులు, ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును శుక్రవారం ప్రగతిభవన్లో కలిసి విజ్ఞఫ్తి చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసినవారిలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావ్, రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితరులు ఉన్నారు.