హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు ఉద్యోగుల పదవీవిరమణ వయసును 61 ఏండ్లకు పెంచాలని టీఎన్జీవో నేతలు రోడ్లు, భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కోరారు. శుక్రవారం టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, ఉపాధ్యక్షుడు తెలగమల్ల పర్వతాలు నాయకత్వంలో టీఎన్జీవోల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హౌసింగ్ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ పెంచేలా ఉత్తర్వులు జారీ అయ్యేలా చూడాలని కోరింది. మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించినట్టు టీఎన్జీవో నేతలు తెలిపారు.