13 గ్రామాలతో మండలం ఏర్పాటు
మారనున్న గ్రామ ముఖ చిత్రం
నెరవేరనున్న గ్రామస్తుల కల
దేవరకద్ర రూరల్, మార్చ్ 29 : ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పా టు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై దృష్టి ని సారించింది. ప్రజల చెంతకు పరిపాలనను తీసుకేళ్లేందు కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కౌకుంట్ల గ్రా మం మండలంగా రూపుదిద్దుకునేందు కోసం దోహదపడనున్నాయి.
గ్రామస్తుల కృషి… ఎమ్మెల్యే సహకారం
కౌకుంట్లను మండలంగా చేయాలని ప్రజలు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గ్రామస్తులతోపాటు పరిసర గ్రామాల ప్రజల కోరికను జిల్లా ఉన్నతాధికారులతోపాటు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం కేసీఆర్ సైతం కౌకుంట్లను మండల కేంద్రంగా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. మండల కేంద్రంగా చే యడానికి కౌకుంట్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని, అవసరమైన మౌలిక స దుపాయాల ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉ న్నారని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక కలెక్ట ర్ నుంచి అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవరకద్ర మండలంలోని 9 గ్రామాలు, చిన్నచింతకుంట మం డలంలోని 4 గ్రా మాలు కలిపి మొత్తం 13 గ్రా మాలతో మం డలం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన ట్లు తెలుస్తున్నది.
మారనున్న రూపురేఖలు…
దేవరకద్ర మండలంలోని అతిపెద్ద గ్రామమైన కౌకుంట్ల మండల కేద్రంగా మారితే గ్రామ రూపురేఖలు మారే అవకాశం ఉంది. వ్యాపార, వాణిజ్య పరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 13 గ్రామ పంచాయతీలతో కౌకుంట్లను మండలంగా చేసేందుకు అనుకూలంగా ఉందని తీ ర్మానాలు చేయడంతో ప్రజల కల నెరవేరనుందన్న చర్చ ప ర్వంలో జరుగుతున్నది.