హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తూర్పు, ఈశాన్య దిశల నుంచి రాష్ర్టంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి దేశంలోని వాయవ్య ప్రాంతంలోని కొన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీని ఫలితంగా రాష్ర్టంలో మూడురోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 18 జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయని టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. రాష్ర్టంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేటలో 6.75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్శీదేవిపల్లిలో 5.70, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కేపీహెచ్బీకాలనీలో 4.70 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వివరించింది.