హైదరాబాద్ : మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి దక్షిణ తెలంగాణలో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.