హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రోజు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇక మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 5 గంటలకు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. శేరిలింగంపల్లి, షేక్పేట్, ఆసిఫ్నగర్ ఏరియాల్లో అత్యధికంగా 4.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. చార్మినార్, ఖైరతాబాద్లో 4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే.. నిజామాబాద్లోని డిచ్పల్లిలో అత్యధికంగా 27 మి.మీ., సిరికొండలో 26.8 మి.మీ., బోధన్లో 25.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.