Telangana
- Dec 02, 2020 , 06:51:26
రేపు పలుచోట్ల మోస్తరు వానలు

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్నది. అది వచ్చే 12 గంటల్లో తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది.
తాజావార్తలు
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి
- మైనారిటీల మెప్పు కోసం దీదీ తాపత్రయం : బీజేపీ
- యాదాద్రి..కేసీఆర్ కలల ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్
- పసిడి స్మగ్లింగ్: చెన్నైలో తొమ్మిది మంది అరెస్ట్
- భారీ మంచులో మహిళను ఆరు కిలోమీటర్లు మోసిన జవాన్లు
- ఫేక్న్యూస్ నమ్మొద్దు: రైళ్ల ప్రారంభంపై కేంద్రం
MOST READ
TRENDING