నిజామాబాద్ : రికార్డుస్థాయిలో కురిసిన వర్షంతో నిజామాబాద్ నగరం నీటమునిగింది. దాదాపుగా పది గంటల పాటు ఏకధాటిగా కురిసిన వాన బీభత్సం సృష్టించింది. సగానికి ఎక్కువ ప్రాంతాలు నీళ్లలో తేలాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, రైల్వే కమాన్ , వినాయక నగర్, ప్రగతి నగర్ కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
చంద్రశేఖర్ కాలనీ లో నీళ్లు చేరడంతో చాలామంది ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేశారు. ఫులంగ్ వాగు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉగ్రరూపంలో పారడంతో దీప ప్రాంత ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : సరళాసాగర్కు జలకళ
మార్స్ గ్రహంపై రాళ్లను సేకరించిన నాసా రోవర్
Lmd Reservoir : ఎల్ఎండీకి భారీగా ఇన్ఫ్లో