సియోల్: టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది. కరోనా వైరస్ ఆందోళన వల్ల ఈ ఏడాది జరిగే విశ్వక్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ క్రీడామంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో 1988 ఒలింపిక్స్ను బహిష్కరించిన తర్వాత ఉత్తర కొరియా తొలిసారి విశ్వక్రీడలకు దూరం కానుంది. అయితే ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఉత్తరకొరియా తప్పుకోవడంతో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానూ పతకం సాధించే అవకాశాలు మెరుగయ్యాయి.