హైదరాబాద్ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దయ్యింది. సూర్యాపేట జిల్లాలో 67 చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కాగ్నా, మూసీ నదులు, కాకరవేణి, ఈసీ, నంది వాగులు ఉగ్రరూపం దాల్చగా.. సర్పన్పల్లి, శివసాగర్ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ముంబై మార్గంలోని రైల్వే ట్రాకుల వెంబడే ఉండే కొండచరియలు విరిగి పడటంతో 12 రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముంబై- హైదరాబాద్, ముంబై -సికింద్రాబాద్ రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.