జోగులాంబ గద్వాల : జిల్లా వ్యాప్తంగా సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోయింది. రాజోలి మండలంలో భారీ వర్షం కురవడంతో సుమారు 400 బస్తాల వరకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. కేటీ దొడ్డి మండలంలో ధాన్యం కొంతమేర త డవడంతో అప్రమత్తమైన అధికారులు, రైతులు ధాన్యంపై పరదాలు కప్పారు. నష్టం ఎంత జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి…
ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి