హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని వెల్లడించింది. కేరళ సముద్రతీరం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని వాతావరణశాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.