కుత్బుల్లాపూర్, జూన్ 29 : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం కొంపల్లి మున్సిపాలిటి కార్యాలయంలో సమావేశం హాల్లో అధికారులతో, చైర్మన్, వైస్చైర్మన్తో పాటు కౌన్సిలర్లతో కలిసి పలు సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదును సకాలంలో అధికారులు, సిబ్బంది స్పందించి వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ కమిషనర్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఎమ్మెల్యే వివేకానంద్, చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్లతో పాటు, ఆయా శాఖల విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు వాటిల్లకుండా అన్నీ రకాల చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు డప్పు కిరణ్కుమార్, రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్, నాయకురాలు సంగీతారెడ్డి, నాయకులు దేవేందర్యాదవ్, లక్ష్మణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్, జూన్ 29 : ప్రజలకు చేరువలో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలందరికీ టీకాలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేఎంజీ గార్డెన్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా కమిటీ హాల్లు, ఫంక్షన్హాల్స్, స్కూళ్లలో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దిశగా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఆలయాల అభివృద్ధికి సకాలంలో తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం రంగారెడ్డినగర్ 127వ డివిజన్ పరిధిలోని కల్యాణ వేంకటేశ్వర ఆలయ కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడిగా నార్లకంటి శివకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సందీప్కుమార్, వైస్ ప్రెసిడెంట్గా క్రాంతియాదవ్లతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
సంక్షేమ సంఘాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. జీడిమెట్ల 132వ డివిజన్ సప్తగిరి ఎన్క్లేవ్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికవడంతో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రెసిడెంట్గా ఎల్.నర్సింగరావు, వైస్ ప్రెసిడెంట్గా కూన రాజ్కుమార్, జనరల్ సెక్రటరీగా అశోక్రావులతో పాటు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.