యాచారం, మార్చి 12 : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు మస్కు రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. పట్టభద్రుల ఇంటింటికీ తిరుగుతూ వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. జీడీపీ పెంచుతానని చెప్పిన ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు నియోజకవర్గానికి ఒరుగబెట్టిందేమీ లేదన్నారు. పట్టభద్రులు ఆలోచించి వాణీదేవికి మద్దతు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మారోజు శ్రీనివాస్చారి, మహ్మద్ ఖాజు, బర్ల కృష్ణ, జానీ, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
విద్యావేత్తను గెలిపించుకుందాం
మంచాల, మార్చి 12 : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి పట్టభద్రులు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఫిట్మెంట్, పీఆర్సీ వయోపరిమితి పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీ రాంచందర్రావు ఏనాడు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదన్నారు.
మొదటి ప్రాధాన్యత ఇవ్వండి..
మంచాల, మార్చి 12 : రాష్ట్రంలో ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవి అన్నారు. శుక్రవారం నోముల, ఆరుట్ల తదితర గ్రామాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బాల్రాజ్, టీఆర్ఎస్ నాయకులు చింతకింది వీరేశం, కరుణాకర్రెడ్డి, ప్రభాకర్, భిక్షపతి ఆరుట్లలో టీఆర్ఎస్ నాయకులు చిందం రఘుపతి, కందాల శ్రీశైలం, వినోద్ పాల్గొన్నారు.
గ్రామాల్లో జోరుగా టీఆర్ఎస్ ప్రచారం
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 12 : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని దండుమైలారంలో ఎంపీపీ కృపేశ్, మండలాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పోల్కంపల్లి గ్రామంలో సహకార సంఘం చైర్మన్ రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో దండుమైలారం సర్పంచ్ మల్లీశ్వరి జంగయ్య, సహకార సంఘం చైర్మన్ బిట్ల వెంకట్రెడ్డి, నాయకులు మంఖాల దాసు, చెరుకూరి యాదగిరి, చెరుకూరి రవీందర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
మజీద్పూర్లో ఇంటింటికీ ప్రచారం..
అబ్దుల్లాపూర్మెట్, మార్చి 12 : టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నారోజుల రాజారాంచారి, సీనియర్ నాయకుడు ఎడ్ల మహేందర్ముదిరాజ్ అన్నారు. మజీద్పూర్ గ్రామంలో శుక్రవారం పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాణీదేవికి పట్టభద్రులు మొదటి పాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించామన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
అభివృద్ధికి పట్టంకట్టండి..
ఆమనగల్లు, మార్చి 12 : అభివృద్ధి సంక్షేమానికి పట్టభద్రులు పట్టం కట్టాలని టీఆర్ఎస్ నాయకుడు తోటగిరి కోరారు. మున్సిపాలిటీతో పాటు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చివరిరోజు కావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టభుద్రుల ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. వాణీదేవికి మద్దతుగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఖలీల్, రమేశ్, నరేందర్నాయక్, కృష్ణ పాల్గొన్నారు.