ఆర్ఎంపీలతో సమీక్షలో జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్
షాబాద్, మే 17: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేదిలేదని జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్ హెచ్చరిం చారు. సోమవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాల యం లో ఆర్ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొవిడ్ బాధితులను ఆర్ ఎంపీలు ఎలాంటి వైద్యం చేయకుండా ప్రభుత్వ దవాఖానకు పంపించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించి, బాధితులకు హెల్త్కిట్స్ అందిస్తున్నామాన్నరు. ఆర్ఎంపీలు మాములు జ్వర సమస్యలుంటే వైద్యం చేయాలన్నారు. సమావేశంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి, వైద్యసిబ్బంది రజాక్, నవీన్, గోపాల్, ఆర్ఎంపీలు పాల్గొన్నారు.