హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ)గా రఘునందన్రావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్శాఖ కమిషనర్గా ఉన్నారు. మొన్నటివరకు వ్యవసాయశాఖ కార్యదర్శిగా ఉన్న జనార్దన్రెడ్డిని ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడంతో ఆ స్థానాన్ని రఘునందన్రావుతో భర్తీచేశారు.