హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ఆర్మీ దవాఖాన రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘరామ కృష్ణంరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ఫిర్యాదు చేశారు. తనను త్వరగా దవాఖాన నుంచి డిశ్చార్జి చేసేందుకు వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేపీరెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని తెలిపారు. మఫ్టీ పోలీసులు దవాఖానలో మకాం వేసేందుకు కేపీరెడ్డి సహకరించారని ఆరోపించారు.