వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్డౌన్తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటున్నారు. కరోనా రెండో దశ తీవ్రత పెరగడంతో మే 12న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. 39 రోజుల తర్వాత ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు.
భక్తులు మాస్క్లు ధరించడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు స్వామివారిని నాలుగువేల మంది వరకు దర్శించుకున్నారు. రేపు సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వస్తున్నారు. సోమవారం నుంచి ఆర్జిన సేవలు, కోడెమొక్కులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.