హైదరాబాద్ : తలసేమియా రోగుల సహాయర్థం రాచకొండ పోలీసులు రక్తదానం చేశారు. గడిచిన రెండు రోజులుగా నిర్వహించిన బ్లడ్ క్యాంప్ ద్వారా 183 యూనిట్ల రక్తం సేకరించారు. రాచకొండ పోలీసులు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సంయుక్తంగా మంగళ, బుధవారాల్లో భువనగిరి, యాదగిరిగుట్ట పట్టణాల్లో బ్లడ్ క్యాంప్ను నిర్వహించాయి. ఇరు పట్టణాల్లోని యువకులతో పాటు సమీప గ్రామాల్లో యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తందానం చేశారు.
కరోనా మహమ్మారి సమయంలో తలసేమియా రోగులకు రక్తం దానం చేయాల్సిందిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ యువకులను కోరారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ మాస్ డ్రైవ్ జరుగుతున్న ఈ తరుణంలో వ్యాక్సినేషన్ తీసుకున్న వారి నుండి రక్తదానం స్వీకరించలేరని.. కావునా అంతకుముందే తలసేమియా రోగుల సహాయార్థం బ్లడ్ డోనేట్ చేయాల్సిందిగా సీపీ పేర్కొన్నారు.