హైదరాబాద్ : తెలంగాణ వార్షిక బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ఒక గంట 7 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ర్ట బడ్జెట్ను రూ. 2,30,825.96 కోట్లుగా ప్రతిపాదించారు. 2020-21 బడ్జెట్ ప్రతిపాదలను ప్రభుత్వం సవరించింది. రూ. 1.82 లక్షల కోట్ల నుంచి రూ. 1.66 లక్షల కోట్లకు సవరణ చేసింది. 2020-21 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ బడ్జెట్లో రూ. 47,911.54 కోట్ల మేర ప్రతిపాదనలు పెరిగాయి. గత బడ్జెట్తో పోలిస్తే 26.19 శాతం ప్రతిపాదనలు పెరిగాయి.
-రాష్ర్ట బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు
-రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు
-ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు
-పెట్టుబడి వ్యయం రూ. 29.046.77 కోట్లు
-రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు
-నూతన సచివాలయం నిర్మాణానికి రూ. 610 కోట్లు
-వైద్యారోగ్య శాఖకు రూ. 6,295 కోట్లు
విద్యారంగానికి..
-విద్యారంగ అభివృద్ధికి నూతన పథకం కోసం రూ. 4 వేల కోట్లు
-పాఠశాల విద్యకు రూ. 11,735 కోట్లు
-ఉన్నత విద్యారంగానికి రూ. 1,873 కోట్లు
ఎస్సీ, ఎస్టీల ప్రగతి
-వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్
-ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు
-ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు
బీసీల సంక్షేమం కోసం..
-నేతన్నల సంక్షమం కోసం రూ. 338 కోట్లు
-బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు రూ. 1000 కోట్లు
-మొత్తంగా బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,522 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం..
-మైనార్టీ గురుకులాల నిర్వహణకు రూ. 561 కోట్లు
-మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు
-మహిళా, శిశు సంక్షేమం
-షీ టాయిలెట్లకు రూ. 10 కోట్లు
-మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు
-మొత్తంగా మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు
పట్టణాల అభివృద్ధి కోసం..
-పట్టణ ప్రగతికి రూ. 500 కోట్లు
-పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి రూ. 200 కోట్లు
-హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం
-ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు
-సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
-మూసీ నది పునరుజ్జీవం కోసం, సుందరీకరణ కోసం రూ. 200 కోట్లు
-ఓఆర్ఆర్ పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీల తాగునీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు
-వరంగల్ కార్పొరేషన్కు రూ. 250 కోట్లు
-ఖమ్మం కార్పొరేషన్కు రూ. 150 కోట్లు
-మొత్తంగా ఈ బడ్జెట్లో పురపాలక, పట్టణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు
పరిశ్రమలకు
-పరిశ్రమల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు
-పరిశ్రమల శాఖకు రూ. 3,077 కోట్లు
రహదారులు, భవనాల నిర్మాణం
-ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 800 కోట్లు
-పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 300 కోట్లు
-సమీకృత కలెక్టరేల్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్మాణానికి రూ. 725 కోట్లు
-ఆర్వోబీ, ఆర్యూబీలకు రూ. 400 కోట్లు
-మొత్తంగా రోడ్లు, భవనాల శాఖకు రూ. 8,788 కోట్లు
-రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రూ. 750 కోట్లు
-పౌర విమానయాన అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు
-పల్లెప్రగతి కింద ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు రూ. 5,761 కోట్ల నిధులు విడుదల
-తొలిసారిగా రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల, జిల్లా పరిషత్లకు రూ. 500 కోట్ల నిధులు ఇస్తాం
-ఇందులో జిల్లా పరిషత్లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్లకు రూ. 248 కోట్లు ఇస్తాం
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు
-ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు