హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): మూడేండ్లుగా మాయమాటలు చెప్పి, డబ్బు ఆశజూపి దాదాపు 20 మంది మహిళలపై లైంగికదాడికి పాల్పడి నగలు, నగదు దోచుకెళ్తున్న హుస్సేన్ఖాన్ అనే పాత నేరస్థుడిని గురువారం రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నేరాలు అంగీకరించిన నిందితుడు దోచుకున్న సొత్తు రూ.3.95 లక్షలకు కూడా పోలీసులకు అప్పగించాడు. గతంలో పోలీసునంటూ ప్రేమ జంటలను బెదిరించి డబ్బు దోచుకుంటూ తొమ్మిది సార్లు పోలీసులకు చిక్కాడు. 2016 లో హైదరాబాద్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇప్పుడు రూటు మార్చి లైంగికదాడులకు పాల్పడుతూ సొత్తును దోచుకుంటూ పోలీసులకు చిక్కాడు. ఎల్బీనగర్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్భగవత్ కేసు వివరాలను గురువారం మీ డియాకు వెల్లడించా రు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన హుస్సేన్ఖాన్ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల ఒకటిన సా యంత్రం జిల్లెలగూడ కల్లు కంపౌండ్ వద్ద ఒంటరిగా తిరుగుతున్న మహిళను హోండా యాక్టివాపై వచ్చిన హుస్సేన్ఖాన్ అటకాయించి ఆమెతో మాటలు కలిపాడు. నగదు ఆశచూపి ఆమెను బండిపై తీసుకెళ్లి పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఆమె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె వంటి మీద ఉ న్న కమ్మలు, నల్లపూసల గొలుసు, 2,500 నగదును తన బండి డిక్కీలో పెట్టాడు. లైంగికదాడికి పాల్పడ్డ తర్వాత మహిళ తేరుకుని వచ్చేలోపే అక్కడి నుంచి బండితో పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత మహిళ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. దాదాపు 45 సీసీ కెమెరాలను పరిశీలించారు. అఘాత్యానికి పాల్పడింది.. హుస్సేన్ఖాన్గా గుర్తించారు. ఇదే తరహాలో లైంగికదాడికి పా ల్పడినట్లు పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.
వరుస ఘటనలతో నిందితుడు కోసం గాలిస్తుండగా.. గురువారం పెద్దఅంబర్పేట వద్ద హుస్సేన్ఖాన్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో రాచకొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ లో ఈ రెండు ఘటనలే కాకుండా హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 2018 నుంచి ఈ నెల ఒకటి వరకు 20 మందికిపైగా మహిళలపై లైంగికదాడికి పాల్పడినట్టు హుస్సేన్ఖాన్ అంగీకరించాడు. అందులో 19 కేసులకు సంబంధించి మహిళల నుంచి దోచుకున్న సొత్తును పోలీసులకు అప్పగించాడు.