హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియాన్ని సోమవారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. మూడంచెల భద్రత ఏర్పాట్లపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కోసం దాదాపు 1200 మంది పోలీసులను మోహరించనున్నట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది తిరిగేందుకు అనుమతి ఉండదని సీపీ వెల్లడించారు.