లక్నో: తన కుమారుడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఉత్తరప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నాటి మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పుడు తన కుమారుడు, ఎంపీ అయిన ప్రవీణ్ నిషాద్కు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు దీనిపై చాలా అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీ తన తప్పును సరిద్దిద్దుకోకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంజయ్ నిషాద్ హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇప్పటికే తన అభిప్రాయాలు చెప్పానని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు.