హైదరాబాద్, జూన్3(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, వేడుకల కమిటీ చైర్మన్ కే కేశవరావు తెలిపారు. గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులతో కలిసి నెక్లెస్ రోడ్డును సందర్శించారు. ఈ నెల 28న పీవీ శత జయంతిని పురసరించుకుని నెక్లెస్ రోడ్డు వద్ద పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించారు. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్గా మారుస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అక్కడ పీవీ నరసింహారావు మార్గ్ పేరిట బోర్డును ఏర్పాటుచేశారు.