ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో భారత్ తరపున పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించడం పట్ల నామ అభినందనలు తెలిపారు. సింధు తన అద్భుతమైన క్రీడా ప్రదర్శనతో చైనాకు చెందిన జింగ్ ఓడించి కాంస్య పతకం గెలుచుకోవడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. సింధు అంటే ఒక చరిత్ర అని ప్రస్తుతం ఎదుగుతున్న క్రీడాకారులకు సింధు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.