ముంబై ,మే 4: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమై,మధ్యాహ్నం సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీల సెంటిమెంటును బలపరిచాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోనా భయాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగమనం నేపథ్యంలో సూచీలపై ప్రభావం చూపుతాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.89 వద్ద ట్రేడ్ అవ్వగా.. సెన్సెక్స్ ఇవాళ 48,881.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,996.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,521.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 0.26శాతం అంటే124 పాయింట్లు లాభపడి 48,843 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లో ఉంది. నిఫ్టీ 14,687.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,723.40 వద్ద గరిష్టాన్ని,14,580.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ 0.21 శాతం అంటే30 పాయింట్లు ఎగిసి14,664 పాయింట్ల వద్ద నిలిచింది.