త్వరలోనే ఫర్దీపూర్ లిఫ్ట్ చేపడుతాం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
చిన్నచింతకుంట మండలంలో పర్యటన
వీరాయిపల్లిలో వేరుశనగ పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలన
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 11: త్వరలోనే రైతు వేదికలకు ఇంటర్నెట్ అనుసంధానం చేసి సకల సౌకర్యాలు కల్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలంలో పర్యటించి రైతువేదికలు ప్రారంభించి, చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో పర్యటించి వచ్చేనెలలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్న వేరుశనగ పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలన చేశారు.
రైతులందరినీ ఒక చోటకి చేర్చేందుకు ప్రభుత్వం రైతు వేదికలు ఏర్పాటు చేసిందని, భవిష్యత్లో ఇంటర్నెట్ను అనుసంధానం చేసి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలంలోని చింతకుంట, వడ్డెమాన్, లాల్కోట, ఫర్దీపూర్ క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఆదివారం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అదేవిధంగా చింతకుంట పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. వీటితోపాటు పల్లమర్రిలో రూ.5.79కోట్లతో నిర్మించనున్న చెక్డ్యాంకు శంకుస్థాపన చేశారు. అలాగే గోప్యానాయక్ తండా నుంచి ఫర్దీపూర్ వరకు రూ.2కోట్ల 5లక్షలతో బీటీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం ఫర్దీపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కోయిల్సాగర్ నుంచి రామన్పాడు వరకు ఉన్న ఊకచెట్టు వాగుపై ఇదివరకే 9 చెక్డ్యాంల నిర్మాణం చేపట్టామని, ఈ వాగుపై సుమారు 36కిలోమీటర్ల మేర అవసరమైనన్ని చెక్డ్యాంలు నిర్మించి ఎక్కడి నీటిని అక్కడే సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు.
దీని ద్వారా వాగును జీవనదిలా మారుస్తామన్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ పేరూర్ లిఫ్ట్ను మంజూరు చేశారని, అదేవిధంగా ఫర్దీపూర్ చెరువును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ఫర్దీపూర్ లిఫ్ట్ను కూడా చేపడుతామని మంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో వరి పంటను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతి కుటుంబం లబ్ధ్ది పొందుతున్నదని ఎమ్మెల్యే అన్నారు. రై తుల సంక్షేమానికి ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాము, ఆర్డీవో పద్మశ్రీ, ఏడీ యశ్వంత్రావు, డీఎస్పీ శ్రీధర్, వివిధ శాఖల అధికారు లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
సచిన్ వాజ్కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ అరెస్ట్
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు
అది దారుణ హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి