హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, మంత్రిగా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారు. రాజకీయాల్లో ఎమ్మెస్సార్ ముక్కుసూటి మనిషిగా పేరొందారు.ఎమ్మెస్సార్ మృతి పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెస్సార్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నల, జానారెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ మరణం పార్టీకి తీరని లోటు. ఆయన క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడు. ఎమ్మెస్సార్ మృతి పట్ల ఏఐసీసీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ సంతాపం తెలిపారు.