దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 39,923 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 695 మంది మరణించారు. 24 గంటల్లో 53,249 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి మరణిస్తు్న్న వారి సంఖ్య 80వేలకు చేరువలో ఉంది. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 79,552కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,19,254 యాక్టివ్ కేసులున్నాయి.