షాబాద్/వికారాబాద్,ఏప్రిల్24(నమస్తేతెలంగాణ): కొవిడ్-19 వ్యాక్సినేషన్ను రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ల్లను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా వైద్య అధికారులతో ఉదయం, సాయం త్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమాచారం అందజేయాలన్నారు.ఐసీయూలో ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయాలన్నారు.
కలెక్టర్లు ఆసుపత్రుల పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్శంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 27 ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయని, ఇందులో 20 దవాఖానకు కొవిడ్ చికిత్సల కోసం అనుమతించామని మొత్తం 67 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని సీఎస్కు తెలిపారు. ప్రస్తుతం రెండు కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ రోగుల వైద్యసేవల కోసం 124 ప్రైవేట్ దవాఖానలున్నాయని, అదనంగా 9దవాఖానలను గుర్తించామని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా జాగ్రతలు తీసుకుంటామని కలెక్టర్ అమయ్కుమార్ సీఎస్కి వివరించారు.
కార్యక్రమంలో వైద్యశాఖ సెక్రటరీ రిజ్వ, పీఆర్అండ్ ఆర్డీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఎంహెచ్ఓ సుధాకర్ షిండే, డాక్టర్లు అరవింద్కుమార్,మల్లికార్జున్, యాదయ్య, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, పరిశ్రమల అధికారి రాజేశ్వర్రెడ్డి, డీపీవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం కొవిడ్ నియంత్రణకు సంబంధించి అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టింది. ముఖ్యంగా కొవిడ్కు సంబంధించి ప్రభుత్వాసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇందుకు గాను అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ పరీక్షల నిర్వహణతోపాటు హోంఐసోలేషన్లో ఉన్నవారికి కిట్స్ అందజేయడం, వ్యాక్సినేషన్ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పరీక్షలు, వ్యాక్సినేషన్ సంఖ్యను కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు భారీగా పెంచారు.అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరికైనా సీరియస్ ఉంటే మెరుగైన చికిత్స అందించేందుకుగాను జిల్లాలో అన్ని వసతులుగల ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధంగా ఉంచారు.అంతేకాకుండా కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, సంబంధిత ప్లాంట్ల ద్వారా 100 పడకలకు సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా 2500 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది కొవిడ్ సేవలందిస్తున్నారు.
కరోనా వైరస్ను కట్టడిలో భాగంగా ప్రస్తుతం రోజుకు 7 వేల మందికి కొవిడ్ పరీక్షలను చేస్తున్నారు.ఆర్టీపీసీఆర్ నమూనాలకు సంబంధించి జిల్లా నుంచి ఈఎస్ఐ దవాఖానకు పంపిస్తున్నారు.జిల్లావ్యాప్తంగా 61కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారితోపాటు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు వారాల క్రితంతో పోలిస్తే ఆ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 97శాతం మంది వ్యాక్సిన్ వే యించుకోవడం గమనార్హం. అంతేకాకుండా 45 ఏండ్లు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అయితే వచ్చే నెల 1వ తేదీ నుంచి 18 ఏండ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ వేయించుకునేందుకుగాను ముందుగా తమ వివరాలను కొవిన్ యాప్లో పొందుపర్చాలని ప్రభుత్వం సూచించింది. అయితే జిల్లాలోని 49 ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా యంత్రాం గం ఏర్పాటు చేసింది. ఒక్కో ఆసుపత్రిలో రోజుకు వంద మంది కి చొప్పున వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించగా డిమాండ్ పెరుగడంతో ఒక్కోరోజు 200ల మంది వరకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. రోజుకు దాదాపు ఆరు వేల మందికి కరోనా టీకా అందిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు.
వికారాబాద్,మార్చి24,(నమస్తే తెలంగాణ): కరోనాను కట్టడి చేసేందుకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైం ది.అన్ని విభాగాలను అప్రమత్తం చేయడంతో పాటు ముం దస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కలెక్టర్ పౌసుమి బసు ఆదేశాల మేరకు జిల్లాలోని 18 మండలాల్లోని 566 పంచాయతీల పరిధిలో నిత్యం టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగుతున్న ది. జిల్లా ఎస్పీ నారాయణ నిత్యం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కొవిడ్ బారిన పడిన వారికి జిల్లాలోనే మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రంలోని మహావీర్ దవాఖానలో ఐసీయూ వెంటిలేటర్కు రూ.9వేలు, వెం టిలేటర్ లేకుండా రూ. 7500,ఐసోలేషన్కురూ.4వేలు గా ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే నెల 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్, రిజిస్ట్రేషన్కు సంబంధించి తమకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాం. ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ, చికిత్సను కూడా అందిస్తున్నాం. కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లున్నాయి. వంద పడకలకు సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. – జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి