పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ

తెలుగు యూనివర్సిటీ : పదవులకే వన్నెతెచ్చిన పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలే దేశాభివృద్ధికి బాటలు వేశాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిరణం సాహితీ సంయుక్తాధ్వర్యంలో పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి మహోత్సవం సందర్భంగా పీవీ నరసింహారావు జీవితం-సాహిత్యం ఇతివృత్తంగా నిర్వహించిన వచన కవితల పోటీల విజేతలకు శుక్రవారం ఏసీగార్డ్స్లోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో నగదు బహుమతులను అందజేసి సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు బైస దేవదాసు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవీ ఆదర్శజీవి కవితకు ప్రముఖ రచయిత పులిపాక నందకిశోర్, భూమిపుత్రుడు కవితకు శ్రీధర్ కొమ్మోజు, స్థిత ప్రజ్ఞుడు కవితకు చివుకుల వాసుదేవమూర్తికి నగదు పురస్కారాలను రమణాచారి అందజేసి అభినందించారు. సాహితీవేత్తలు వెంకటరెడ్డి, రఘురామ్, సుబ్బారావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రైతు ఆందోళనపై 22 ఎఫ్ఐఆర్లు : రైతు నాయకులపై కేసులు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత
- ఆన్లైన్ క్లాస్లో టీచర్ను బురుడీ కొట్టించిన స్టూడెంట్
- ఆచార్యకు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
- హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్న్యూస్
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు