హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి శుక్రవారం నాటికి ధాన్యం కొనుగోళ్లు రికార్డుస్థాయిలో 67 లక్షల టన్నులకు చేరాయి. మరో 10-15 లక్షల టన్నుల ధాన్యం రానున్నది. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలో యాసంగిలో ఇంత భారీ మొత్తంలో ధాన్యం దిగుబడి రావడం ఇదే తొలిసారి. 10 లక్షల మంది రైతుల నుంచి ప్రభు త్వం రూ.12,247 కోట్ల విలువైన 67 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కరోనా కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది.