మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు ఇటీవల మేకర్స్ నుండి అనౌన్స్మెంట్ వచ్చింది. లాక్డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, ఈ సమయంలోనే సంగీత దర్శకుడి గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అందరి దృష్టి థమన్పై పడింది. ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. థమన్ సంగీతం సినిమాపై భారీ హైప్స్ తెస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు 28వ సినిమాకు కూడా థమన్ ను ఎంపిక చేయడం జరిగిందట. ఇప్పటికే మహేష్ బాబు 27వ సినిమా సర్కారు వారి పాటకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆ వెంటనే థమన్ సంగీత సారథ్యంలో త్రివిక్రమ్.. మహేష్ మూవీ రాబోతుంది. కాగా, త్రివిక్రమ్- థమన్ కాంబినేషన్లో రూపొందిన అల వైకుంఠపురములో ఆల్భమ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.