హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రజా గాయకుడు గద్దర్ శుక్రవారం మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇష్టాగోష్టిగా చర్చించుకున్నట్టు సమాచారం.