కాటారం, జూన్ 14 : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు అవగాహన రాహిత్యంతో బాలికలకు చిన్నవయసులోనే వివాహాలు చేసి వారి మెడకు ఉరితాళ్లు బిగించొద్దని తహసీల్దార్ సునీత కోరారు. మండలంలోని శంకరంపల్లిలో సోమవారం బాలికకు వివాహం జరుగుతున్నదనే సమాచారంతో ఆమె సీడీపీవో రాధిక, డీసీపీవో హరికృష్ణ, ఎస్సై సాంబమూర్తితో కలిసి అడ్డుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వారు వివరించారు. సునీత మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులకుతోడు ఆడపిల్ల ఇంటికి భారమని భావిస్తున్న కొందరు బాల్య వివాహాలకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఇది చట్టరీత్యా నేరమని ఆమె పేర్కొన్నా రు. బాల్యవివాహాలు చేసినా, లైంగిక వే ధింపులకు పాల్పడినా వెంటనే 1098 చైల్డ్లైన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బా లల సంరక్షణ అధికారి వెంకటస్వామి, వీఆర్వో బండి శ్రీనివాస్, కార్యదర్శి హరిశ్రీ, చైల్డ్లైన్ టీమ్ సభ్యురాలు సుప్రియ, ఆశవర్కర్ సరిత పాల్గొన్నారు.