కొవిడ్ నేపథ్యంలో ములాఖత్లు బంద్
యోగా చేయించాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల మానసిక ప్రవర్తనపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతోంది. కుటుంబ సభ్యులను కలిసేందుకు ములాఖత్లు లేకపోవడం.. లాక్డౌన్ల కారణంగా కోర్టులకు సెలవులు ఇవ్వడం.. తోటి ఖైదీలతోనూ మనసువిప్పి మాట్లాడుకునే వాతావరణం లేకపోవడం లాంటి పలు కారణాలతో దాదాపు 80 శాతం మంది ఖైదీలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు కేంద్ర హోంశాఖ గుర్తించింది. మరోవైపు జైళ్లలో పనిచేసే సిబ్బంది కూడా కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జైళ్లలో ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు సిబ్బందిలో ఒత్తిడి తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాల ముఖ్య కార్యదర్శులకు, జైళ్లశాఖ డీజీలకు, ఐజీలకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ‘డీలింగ్ విత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ప్రిజనర్స్ డ్యూరింగ్ కొవిడ్-19’ పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) రూపొందించిన హ్యాండ్బుక్ను అన్ని రాష్ర్టాల్లోని జైళ్లశాఖ ఉన్నతాధికారులకు పంపింది. ఖైదీలు, జైలు సిబ్బందిలో మానసిక ైస్థెర్యాన్ని పెంచేలా యోగా, ఇతర వ్యాయామాలు చేయించడంతోపాటు రోజువారీగా కొన్ని పనులు అప్పగించాలని, వారికి అవసరమైన మందులు సరఫరా చేయాలని సూచించింది. అదేవిధంగా మానసిక వైద్యనిపుణులతో తరచూ కౌన్సెలింగ్లు ఇప్పించాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.