నల్లగొండ : పీఆర్టీయూ నల్లగొండ జిల్లా మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఇవాళ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ హాజరయ్యారు. జిల్లాలోని 34 మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టమైన హామీ ఇచ్చినందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో సుమారు 2 వేల మంది సంఘం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.