మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున లైంగికదాడికి గురైన బాధిత కుటుంబాలకు మహిళా, శిశు సంక్షేమ తరపున గిరిజన, స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బాధిత కుటుంబాలకు చెక్కులను అందించారు.
ఇటీవల జిల్లాకు చెందిన మహిళ లైంగిక దాడికి గురైన నేపథ్యంలో ఆమె కుటుంబానికి నేడు 25,000 రూపాయల చెక్కును అందించారు. ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం, వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇటీవల లైంగిక దాడికి గురై, హత్య కావించబడిన మోడు ఉష కుటుంబానికి మొదటి విడత 25 వేల రూపాయలు చెక్కును అందించారు.
కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ జిల్లా సంక్షేమ అధికారి సబిత, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు