హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల పరిధి లో ఉన్న భవనా లు, భూములు, ఇ తర ఆస్తుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం అందించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. దీంతోపాటు షెడ్యూల్ 9, 10లోని సం స్థల భూములు, భవనాలు, ఇతర ఆస్తుల వివరాలను కూడా క్రోడీకరించాలని పేర్కొన్నారు. షెడ్యూల్ 9,10లోని సంస్థలు, శాఖలవారీ గా ఆస్తుల వివరాల సేకరణ, పీఆర్సీ అమలు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్రావు గురువారం సీఎస్ సోమేశ్కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. 9వ షెడ్యూల్లోని 91 సంస్థలకుగాను 70 సంస్థలకు సంబంధించి షీలాబిడే కమిటీ సిఫార్సుల మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు.10వ షెడ్యూల్లోని 142 సంస్థల ఆస్తుల పంపకాలు మినహా ఇతర అంశాలను పరిష్కరించుకోవాలని చెప్పారు.