నీలగిరి, మే 25 : కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించి టీకాలు వేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ను వ్యాప్తింపజేసే అవకాశమున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి వ్యాక్సినేషన్ చేపట్టనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా అధికారులు అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలతో కసరత్తు ప్రారంభించారు.. ఇందులో భాగంగా గతంలో 45 సంవత్సరాలు పైబడిన వారు మొదటి డోస్ తీసుకున్న వారి. వివరాలు సేకరించనున్నారు. అసలు వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా కూడా తయారు చేయ నున్నారు. జిల్లాలో వీరి జాబితాను రెండో రోజుల్లో పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో మూడు దశల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ముందుగా వైద్యారోగ్యశాఖ, అంగన్వాడీలు, రెండో దశలో ఫ్రంట్లైన్ వర్కర్లు, మూడో దశలో 60 సంవత్సరాలు పైబడిన,45 సంవత్సరాల దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేసింది. ప్రస్తుతం సూప ర్ స్ప్రెడర్స్ను కూడా టీకాలు వేయాలని నిర్ణయించింది. 15 రంగాల్లో పనిచేస్తున్న (వయస్సు తో సంబంధం లేకుండా) వారికి టీకా వేయనున్నారు.
రెండోడోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం
ప్రభుత్వం ఈనెల 14న వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపి వేసిన విషయం తెలిసిందే. తిరిగి ప్రభుత్వ ఆదేశాలతో పది రోజుల తరువాత రెండో డోసు వ్యాక్సినేషన్ మంగళవారం నుంచి పున: ప్రారంభమైంది. మొదటి డోస్ వేయించుకుని రెండో డోసుకు అర్హత కలిగిన వారు ఉదయం కేంద్రాలు ప్రారంభం కంటే ముందే వచ్చారు. కొందరికి నిర్దిష్ట సమయం పూర్తి కాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మళ్లీ వ్యాక్సిన్ వేస్తుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నల్లగొండ 454 మందికి టీకా..
జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో 454 మందికి రెండో డోసును వేశారు. జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు నల్లగొండ లైన్వాడ, పానగల్, మాన్యంచెల్క అర్బన్ హెల్త్ సెంటర్లు, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి, దేవరకొండ ఏరియాల ఆసుపత్రి, నరికేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తిప్పర్తి పీహెచ్సీ టీకాలను వేశారు.
సూర్యాపేటలో 1020 మందికి టీకా
సూర్యాపేట టౌన్ : జిల్లా వ్యాప్తంగా 1020 మం దికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కోవిషీల్డ్ 95.. కొవాగ్జిన్ 925 మందికి వేయడంతో పాటు ఇప్పటివరకూ 1,43,435 మంది టీకా తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఆదివారాలు కలుపుకుని ప్రతి రోజూ వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెండ్రోజుల్లో జాబితా
ప్రభుత్వ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉన్న సూపర్ స్ప్రెండర్స్ను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నాం. జిల్లాలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీల సహకారంతో సూపర్ స్ప్రెండర్స్ జాబితా తయారు చేయను న్నాం. రెండు రోజుల్లో వారి జాబితా సిద్ధం కానుంది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వీరికి వ్యాక్సినేషన్ ఉంటుంది.
-డాక్టర్ కొండల్రావు, డీఎంహెచ్ఓ నల్లగొండ.