జోగులాంబ గద్వాల : జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దవాఖానాలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దవాఖానాలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని వైద్యులకు సూచించారు. కరోనా సోకిన వారు ఎవరు భయపడవద్దన్నారు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
దవాఖానలో రోగులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వైద్యాధికారి చందు నాయక్, పురపాలక చైర్మన్ కేశవ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి