హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): లక్షల మంది ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్కేవీ మాజీ అధ్యక్షుడు లాకావత్ రూప్సింగ్ హెచ్చరించారు. కవితపై ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లివిగ్రహం వద్ద కవిత చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రూప్సింగ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలో టీఆర్ఎస్కు అనుబంధంగానే ఉద్యోగ, కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని.. వీటిపై ఈటల మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత చొరవతో 4 లక్షల మంది బీడీ కార్మికుతలు, 28వేల ఆశావర్కర్లకు రూ.8 వేల వేతనాలు, 18వేల మంది వీవో, ఆర్పీలకు గౌరవ వేతనాలు, అంగన్వాడీలకు, వీఆర్వో, సింగరేణి, విద్యుత్తు, ఆర్టీసీ తదితర ఉద్యోగుల వేతనాలు పెరిగాయని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు సంతోష్రెడ్డి, మహేశ్ పాటిల్, దాసు, రాజు, ఎన్ యాదలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.