బెంగళూరు, మే 22: జార్ఖండ్ నుంచి కర్ణాటకకు చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలును మహిళా డ్రైవర్ (లోకోపైలెట్) నడిపారు. ఆరుబోగీలున్న ఈ రైలును టాటానగర్ నుంచి 120 మెట్రిక్ టన్నుల ద్రవ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎమ్వో)తో బెంగళూరుకు తీసుకొచ్చారు. రైలులో సిబ్బంది కూడా మహిళలే.